ఈ నెల 21 నుంచి అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. మూడ్రోజుల పాటు అగ్రరాజ్యంలో మోదీ పర్యటన సాగనుంది. విల్మింగ్టన్ లో జరిగే 4వ క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు. సెప్టెంబరు 21న జరిగే క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యమివ్వనున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల అభివృద్ధి లక్ష్యాలకు, ఆకాంక్షలకు తోడ్పాటు అందించడంపై ఈ క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు.

అమెరికాలో జరిగే తాజా క్వాడ్ సమావేశంలో, బైడెన్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే సమయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు కూడా వీడ్కోలు పలకనున్నారు. క్వాడ్ దేశాల గ్రూప్ లో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. క్వాడ్ సదస్సు అనంతరం, ప్రధాని మోదీ ఈ నెల 23న న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వచ్చే వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. మరోవైపు వచ్చే ఏడాది క్వాడ్ దేశాల సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ అంగీకరించింది.

Latest Articles

కేంద్ర మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి.. వారికి ఉద్వాసన తప్పదా?

కేంద్ర మంత్రుల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యవస్తీకరణలో భాగంగా 20-30 మంది మంత్రులను తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరి స్థానంలో కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్