ఏపీ సీఎం జగన్పై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదు సంవత్సరాలుగా పేట ప్రజలను మోసం చేసి ఏ ముఖం పెట్టుకొని చిలకలూరిపేట వస్తున్నారని మండిపడ్డారు. యడవల్లి ఎస్సీ రైతుల భూములను తన బినామీ కంపెనీలకు ఇప్పించింది నిజం కాదా అని నిలదీశారు. గత సంవత్సరం పేటకు వచ్చి 65 కోట్లు ఇస్తానని చెప్పి, నేటికీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగిన వాటన్నంటికి సమాధానం చెప్పి, జగన్ చిలకలూరిపేటలో అడుగు పెట్టా లని డిమాండ్ చేశారు ప్రత్తిపాటి.