మంత్రి సీతక్క ఇలాకాలో పోలీసుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతోంది. ములుగు, ఏటూరు నాగారంకు చెందిన రామకృష్ణ లక్ష రూపాయల నగదు విషయంలో మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ విషయంపై ఎస్ఐ రామకృష్ణను స్టేషన్కు పిలిపించాడు. అనంతరం తెల్ల కాగితంపై సంతకం చేయించుకొని దారుణంగా కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను కులం పేరుతో దూషిస్తూ బూటు కాలితో తన్నాడని వాపోయా డు. అకారణంగా తనను కొట్టిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నా డు.