24.2 C
Hyderabad
Saturday, June 28, 2025
spot_img

హరీశ్‌రావుకు కేసీఆర్‌పై కోపం, ఈర్ష్య ఉంది: పేర్ని

స్వతంత్ర, వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. జగన్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఎన్ని జన్మలు ఎత్తినా బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మొన్నటి వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఘోరంగా ఓడించారని తెలిపారు. మనువు బీజేపీతో మనస్సు చంద్రబాబుతో ఉన్న సీఎం రమేష్, సత్య కుమార్, సుజనా వంటి వారి మాటలను వింటూ తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక ఏపీలో ఉన్నది మాటల ప్రభుత్వమేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసినా విమర్శలపైనా నాని స్పందించారు. హరీశ్ రావుకు మేనమామ కేసీఆర్ మీద కోపం, ఈర్ష్య ఉందని అందుకే కోపం వచ్చినప్పుడల్లా మమ్మల్ని తిడతాడని తెలిపారు. తాము తిరిగి కేసీఆర్‌ను విమర్శిస్తే సంతోషించాలని హరీశ్ అనుకుంటున్నారని ఆరోపించారు. 2018లో హరీశ్ రావు చేతలు ఎక్కువయ్యాయని స్వయంగా కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని పేర్ని వెల్లడించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్