డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్తో పశ్చిమగోదావరి జిల్లా యువతి మిస్సింగ్ మిస్టరీ వీడింది. 9 నెలల క్రితం తన కుమార్తె కనిపించడం లేదని ప్రజాదర్బార్లో పవన్ను కలిసిన ఆమె తల్లి గోడు వెళ్లబోసుకుంది. యువతిని కనిపెట్టాలని పవన్కు విజ్ఞప్తి చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేశారు. యువతి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇన్స్టా గ్రామ్ మెస్సేజ్ల ద్వారా యువతిని కనిపెట్టారు. ఆమె జమ్ముకశ్మీర్ లో మరో యువకుడితో ఉన్నట్లు గుర్తించారు. ప్రేమ పేరుతో యువతిని పలు ప్రాంతాలకు తిప్పినట్టు కనిపెట్టారు. యువతితో పాటు యువకుడు అంజాద్ను విజయవాడ తీసుకొచ్చారు. ఇవాళ తల్లికి యువతిని అప్పగించనున్నారు పోలీసులు.
పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్తో వీడిన యువతి మిస్సింగ్ మిస్టరీ
0
263
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


