సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆకస్మిక తనిఖీలు
తెలంగాణ సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. R అండ్ B డిపార్ట్ మెంట్లో సెక్షన్లను తనిఖీ చేశారు మంత్రి. ఉదయం 11 గంటలయినా ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు. ఇలా అయితే కుదరద ని వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులకు సమయ పాలన ఉండాలని, రేపటి నుంచి టైం మెయింటెన్ చేయా లని సూచించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కోమటిరెడ్డి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడేది లేదన్నారు. జడ్పీ భేటీలో కలెక్టర్ స్పందించట్లేదని కౌశిక్ రెడ్డి నిరసన తెలిపే యత్నం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే కేసు పెట్టారని ఆరోపించారు. కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.