మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా మోదీకి పవన్ అభినందనలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ చేపట్టిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ఈనెల 30వ తేదీతో 100 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. రేడియో ద్వారా ప్రధాని నిర్వహించే ఈ కార్యక్రమం ప్రజలందరికీ చేరువైందని.. సామాన్యుల విజయాలను సైతం మోదీ ప్రస్తావించడం ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తుందని కొనియాడారు. 100కోట్ల మందికి పైగా ఈ కార్యక్రమం విన్నారని తెలిపారు. గొప్ప వ్యక్తులు, కళలు, చేతి వృత్తులు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు.. ఇలా అనేక అంశాలపై చర్చించడం ద్వారా ‘మన్ కీ బాత్’ ప్రజలకు చేరువైందన్నారు.

ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో ‘సేవా పరమో ధర్మ:’ అన్న మాటలు మనసును హత్తుకునే విధంగా ఉంటాయని చెప్పారు. 2014 అక్టోబర్‌ 3న విజయదశమి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగడం అభినందనీయమని జనసేనాని కొనియాడారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ఇలాగే భవిష్యత్ లోనూ కొనసాగాలని పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్ లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్