స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. ఎన్నికల తర్వాత వచ్చే సీట్లను బట్టి సీఎం ఎవరనే నిర్ణయం ఉంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. త్రిముఖ పోటీలో మరోసారి బలి కావడానికి సిద్ధంగా లేనని పవన్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి తనకు దక్కాలంటే తనను గెలిపించి సముచిత స్థానం కల్పించాలని జనసేన కార్యకర్తలను కోరారు. వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, అరాచకాలపై పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. అలాగే జనసేనలో ఉంటూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా పార్టీ నుంచి బహిష్కరిస్తామని జనసేనాని హెచ్చరించారు.
బిగ్ బ్రేకింగ్: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖాయం-పవన్
0
292
Previous article
Next article
Latest Articles
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్య
హైదరాబాద్లో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూద్ చాందీ దారుణ హత్యకు గురయ్యాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు మసూద్ చాందీపై దాడి చేసి హత్య చేసినట్లు...
- Advertisement -
- Advertisement -


