ఒకవైపు గులాబీ పార్టీ నేతలు మేడిగడ్డ సందర్శన పెట్టుకోగా అందుకు కౌంటర్గా కాంగ్రెస్ నాయకులు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత వంశీచంద్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ టీమ్ పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ను సందర్శించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ను దక్షిణ తెలంగాణకు వరదాయినిగా నీటిపారు దలరంగ నిపుణులు పేర్కొంటారు. కరువుసీమగా పేరొందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీటిని పారించే ప్రాజెక్ట్గా అప్పట్లో కేసీఆర్ సర్కార్ అభివర్ణించింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది ఎక్కువ దూరం ప్రవహి స్తుంది. అయితే అదే కృష్ణానదిని ఆనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో అనేక సమస్యలున్నాయి.వీటిలో కరువు, ఫ్లోరైడ్ సమస్యలు ప్రధానమైనవి.
శ్రీశైలం, నాగార్జున సాగర్ అనే రెండు ప్రాజెక్ట్లు ఆంధ్ర, తెలంగాణ మధ్య ఉమ్మడిగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల వెనుక జలాశయాల్లో చేరిన నీటిని తమ ప్రాంతానికి తీసుకెళ్లడానికి ఆంధ్రకు కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయితే తెలంగాణలో అటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు. కృష్ణానది కంటే తెలంగాణ గట్టు ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల సహజంగా నీరు పారే అవకాశం లేదు. దీంతో దక్షిణ తెలంగాణ సాగు, తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణానదిలో మిగులు, వరద నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకుని ఏడాది మొత్తం అవసరాలకు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టిందే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్.
కృష్ణానది మట్టం కంటే పాలమూరు – రంగారెడ్డి జలాశయం ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ పంప్హౌస్ అవస రం. అక్కడి నుంచి నీరు సహజంగా కొంతదూరం పారుతుంది. ఎదుల గ్రామం వరకు నీరు పారిన తరువాత అక్కడ మళ్లీ పంప్హౌస్ పెట్టి నీళ్లను తోడి ఎదుల జలాశయానికి పంపిస్తారు. టోటల్గా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ఫలితంగా నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ , నారాయణ్ పేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు ఫలాలు అందుతాయి. అయితే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ను కేసీఆర్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం 28 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. అయితే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఫలితంగా ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. 2015 జూన్లో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అప్పటి కేసీఆర్ సర్కార్ శంకుస్థాపన చేసింది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంచనావ్యయం రూ. 35 వేల కోట్లు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ను రెండు దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో తాగునీరు సరఫరాకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించు కున్నారు. అందులో భాగంగా ఇప్పటికే మొదటిదశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులు తుదిదశకు చేరుకున్నాయి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్కు అనేక అవరోధాలు తలెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే ఈ ప్రాజెక్ట్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఒకదశలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుకు తెలంగాణ సర్కార్ బదులిచ్చింది.
తాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. అయితే సాగునీటి పనులు మాత్రం పర్యావరణ అనుమతులు పొందిన తరువాతనే చేపడ తామని జాతీయ గ్రీన్ ట్రిబ్యు నల్కు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే తాగునీటి అంశంతోపాటు భవిష్యత్తులో సాగునీరు తోడటా నికి కావాల్సిన పంపు సెట్లను మొదట దశలో నిర్మిం చడం ప్రారంభించారు. కేవలం కాలువలు తవ్వడం మాత్రమే రెండోదశలో పెట్టారు. అయితే మొదటి దశలో కూడా అన్ని రిజర్వాయర్లు, అన్ని పంప్ హౌస్లు వందశాతం పూర్తి కాకపోవడం విమర్శలపా లైంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ మొత్తంగా పూర్తయితే దాదాపు 1,200 గ్రామాలకు తాగునీరు, 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.ఇందులో తాగునీటి కోసం ఉద్దేశించిన కొంతభాగం పూర్త యింది. అనేక పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే సాగునీటి కోసం చేపట్టాల్సిన పనులు ఇంకా ప్రారంభమే కాలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.