తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కాంలో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగినట్టు గుర్తించింది. బ్రోకర్స్, అధికారులే పథకం నిధులు కొట్టేసినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. పశుసంవర్ధకశాఖ సీఈఓ రామచందర్, తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ను నిన్న అరెస్ట్ చేశారు. ప్రధాన నింది తుడు మొహిదొద్దీన్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఒక్కో యూనిట్కు 20 వేల రూపాయలు అధికారులకు కమీషన్ అందినట్టు తెలుస్తోంది. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారుల పాత్ర ఉందని ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.


