Free Porn
xbporn
21.7 C
Hyderabad
Monday, October 28, 2024
spot_img

రాజన్న కోడెల సంరక్షణ పట్ల అధికారుల నిర్లక్ష్యం

      రాజన్నకు కోడె కడితే కోరిన కోర్కెలు తీరుతాయి. దంపతులు కోడె మొక్కు తీర్చుకుంటే పండంటి సంతానం కలుగుతుంది. ఇదీ వేములవాడ రాజన్నపై భక్తుల విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు. కోడె గిత్త మొక్కుల ద్వారానే ఆలయానికి అధిక ఆదాయం లభిస్తోంది. ఇంతటి విశిష్టత కలిగిన దేవాలయంలో కోడెల సంరక్షణలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

  కారకుడైన శివుడు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో రాజరాజేశ్వరుడిగా కొలువైవు న్నాడు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొని యున్న ఈ పవిత్ర క్షేత్రం పౌరాణికంగా, చారిత్రికంగా ఎంతో విశిష్టత సంతరించుకుంది. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా ఈ క్షేత్రం కీర్తింప బడిందని భవిష్యోత్తర పురాణలోని రాజేశ్వరఖండం తెలియజే స్తోంది. చారిత్రక ఆధారాలను బట్టి ఈ పురాతన క్షేత్రం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచి ఉన్నట్టు తెలుస్తోంది. పురాతత్వ ఆధారాలను బట్టి పశ్చిమ చాళుక్య ప్రభువులు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ దేవస్థానం ప్రతి ఏటా వేములవాడ గ్రామాభివృద్ధికి లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలియజేస్తు న్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అంటేనే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు. రాజన్నకు కోడెను కడితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వాసం. ఇదేకాక సంతాన లేమితో అల్లాడే దంపతులు ఇక్కడ కోడె గిత్తను కడితే తప్పక సంతతి కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో గాఢంగా ఉంది. ఆలయానికి వచ్చే భక్తుల్లో అధికశాతం మంది ఇక్కడ కోడెను కట్టేసే వెళ్తారు. ఆలయానికి వచ్చే ఆదాయంలో సింహ భాగం కోడెలను కట్టడం ద్వారానే వస్తుంది. దీనిని బట్టి రాజన్న ఆలయంలో కోడెలకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది. అయితే, ఇంతటి విశిష్టత కలిగిన దేవాలయంలో కోడెల సంరక్షణ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

  రాజన్న ఆలయ కోడెల సంరక్షణకు సంబంధించి గ్రామంలోని కట్ట కింద ఒక గోశాల ఉంది. ఇదే కాక తిప్పాపూర్ లో మరొక గోశాల ఉంది. అయితే కోడెల సంరక్షణ, గోశాల నిర్వహణ విషయాల్లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు భక్తులు ఆరోపిస్తున్నారు. వర్షబీభత్సానికి ఇక్కడి గోశాల బురదమయంగా మారుతోంది. దీంతో, దాదాపు వెయ్యికి పైగా కోడెలు నానా అవస్థలు పడుతున్నాయి. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజన్న ఆలయ అధికారు లకు, రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు భక్తులు ఎన్నో విన్నపాలు చేశారు. అయినా, భక్తుల ప్రతిపాదనలు పట్టించుకునేవారే కరువయ్యారు. దీనిపై విశ్వ హిందు పరిషత్ నాయకుడు నాగుల రాము గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కోడెలు దీనావస్థలో జీవిస్తున్నాయని, కొన్ని మృత్యువాత పడుతున్నాయని ఆయన ఆవేదన చెందారు.ఇప్పటికైనా ఆలయ అధికారులు మొద్దు నిద్రవీడి రాజన్న ఆలయ కోడెలపై శ్రద్ధ చూపాలని, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Latest Articles

హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట

హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. నవంబర్‌ ఆరున నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఏపీ ఎన్నికల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్