స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సివిల్స్ 2022 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 933 మంది సివిల్స్ సర్వీస్ కు ఎంపిక అయినట్లు ప్రకటించింది. జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38, ఐపీఎస్కు 200 మంది ఎంపికయ్యారు.
ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్లో 131 మంది ఎంపికైనట్లు UPSC వెల్లడించింది. ఈ ఫలితాల్లో ఇషితా కిశోర్ మొదటి ర్యాంక్ సాధించగా.. ఏపీలోని తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22వ ర్యాంక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరి 40, హెచ్ఎస్ భావన 55, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంక్ సాధించారు.