PM Modi |దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం కలవరం తెప్పిస్తోంది. కేసులు, మరణాలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ కరోనా ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. కాగా గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్ రాగా.. ఐదుగురు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 7,026 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Read Also: ఇక నుంచి ఏప్రీ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయి
Follow us on: Youtube Instagram