Chandrababu |మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. నాలుగేళ్ల నుంచి ఏపీ కష్టాల్లోనే ఉందన్నారు. శోభకృత్ నామ సంవత్సరం నుంచి ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయమన్నారు. ఇక నుంచి రాష్ట్రానికి అన్నీ శుభశకునాలే అని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలతో ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని.. మార్పు కోసం టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని అరాచకాలు ఈ నాలుగేళ్లలో చూశానన్నారు. తెలుగు వారి బాగు కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని చంద్రబాబు వెల్లడించారు.