దేశ సమగ్రత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ అన్నారు. దేశంలో పదేళ్లుగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అసమానతల వైపు ప్రజలను నడిపిస్తున్నాయని ఆయన విమర్శిం చారు. కులం, మతం పేరిట ఆ శక్తులు చిచ్చు పెడుతున్నాయని రఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు లూటీ చేశారన్నారు. ఇప్పటికైనా ప్రజలు డబ్బులు, మతం ఆధారంగా ఓట్లు అడిగిన వారిని దూరం పెట్టాలని రఫీ పిలుపునిచ్చారు.