సీఎం జగన్పై జనసేన నేత నాగబాబు ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. జనసేనాని పేరును సైతం పలక డానికి భయపడే ముఖ్యమంత్రి జగన్… రాష్ట్రాన్ని అంతంత మాత్రం కూడా అభివృద్ధి చేయలే దంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతంత మాత్రమే కాదు.. శూన్యమే అంటూ రాసుకొ చ్చారు. మేమంతా సిద్దం సభలో అభ్యర్థులను పరిచయం చేస్తూ జగన్ మాట్లాడిన వీడియోలను పోస్ట్కు జత చేశారు. తమ అభ్యర్థులందరూ సౌమ్యులని, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని జగన్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోలను జత చేస్తూ.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కాదు.. రాష్ట్ర అభివృద్ధి కూడా శూన్యం అంటూ నాగబాబు ఎక్స్ వేదికగా కౌంటరిచ్చారు.