తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు వారిని ఉద్దేశిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. చెన్నై ఎగ్మోర్లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు పోయెస్ గార్డెన్లోని కస్తూరి ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమెకు ఫోన్ చేశారు. స్విచాఫ్ రావడంతో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
సినీ నటి కస్తూరీ కోసం ముమ్మర గాలింపు చర్యలు
0
245
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


