భారతదేశంలో ముస్లిం సోదరులు రేపు(శనివారం) రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. శుక్రవారం రాత్రి నెలవంక కనిపించడంతో దేశమంతా శనివారం ఈద్-ఉల్-ఫితర్(Eid-ul-Fitr) జరుపుకోవడానికి ముస్లింలు రెడీ అయ్యారు. నేడు నెలవంక కనిపించడంతో రేపు రంజాన్ పండుగ జరుపుకోనున్నట్లు లక్నోలోని ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తెలిపారు. దీంతో ముస్లింలు తమకు కావాల్సిన వస్తువులను కొనేందుకు మార్కెట్లలో సందడి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసం 29లేదా 30రోజులు ముగింపు దశకు వచ్చిన సమయంలో ముందు రోజు రాత్రి నెలవంక కనిపిస్తే తర్వాతి రోజు పండుగను జరుపుకుంటారు. మరోవైపు సౌదీ అరేబియాతో పాటు చాలా ముస్లింల దేశాల్లో గురువారం రాత్రి నెలవంక కనపడడంతో ఇవాళే రంజాన్ పండుగను జరుపుకున్నారు.
ఇండియాలో కనిపించిన నెలవంక.. రేపే రంజాన్ పండుగ
0
282
Previous article
Next article
Latest Articles
6 నెలలు సమయం ఇచ్చారు.. 6 రోజుల్లోనే విమర్శలా? – సీఎం విజయ్
తమిళనాడు: తిరుచ్చి ఈస్ట్లో టీవీకే పార్టీ సమావేశమైంది. తాను ఎప్పుడూ తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేనే అని అన్నారు విజయ్. తాను సీఎంను కాదని.. ప్రజా సేవకుడిని అని చెప్పారు. ప్రజలు తనను ఓ...
- Advertisement -
- Advertisement -


