35.9 C
Hyderabad
Thursday, March 13, 2025
spot_img

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షలో మంత్రి తుమ్మల

మార్కెట్‌లోకి పత్తి వచ్చే సీజన్‌కు ముందుగానే జిన్నింగ్‌ మిల్లులను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అన్నారు. కొనుగోలు కేంద్రాలు వారంలో ఆరు రోజుల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనిష్ఠ మద్ధతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి రైతులకు ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాటన్‌ అసోసియేషన్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు.

రాష్ట్ర కాటన్‌ వెల్ఫేర్‌ కమిటీతో పాటు జిల్లా కమిటీల్లోకి కాటన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రైతు ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సీసీఐ ప్రతినిధులకు తుమ్మల సూచించారు. ఈ ఏడాది సాంకేతికంగా తీసుకువస్తున్న పేమెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ యాప్‌లతో మిల్లర్లకు కొనుగోళ్లలో మరింత పారదర్శకతకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీసీఐ, కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Latest Articles

గవర్నమెంట్ విద్యాలయాలకు ఆ నాటి వైభవం తిరిగి వచ్చేనా..? – హస్తం సర్కారు తీరుతో చిగురిస్తున్న ఆశలు

కారణాలు ఏవైనా, తప్పిదాలు ఎవరివైనా...చేతులు కాలిపోయాక పత్రాలతోను, నిండా మునిగిపోయాక రక్షణ చర్యలతోను ఏం ఫలితం ఉంటుంది. ప్రైవేట్ ను పరోక్షంగా ప్రోత్సహించే ప్రభుత్వాలు.. ఆ ప్రైవేట్ పై ప్రత్యక్షంగా దండయాత్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్