పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షలో మంత్రి తుమ్మల

మార్కెట్‌లోకి పత్తి వచ్చే సీజన్‌కు ముందుగానే జిన్నింగ్‌ మిల్లులను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో అన్నారు. కొనుగోలు కేంద్రాలు వారంలో ఆరు రోజుల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కనిష్ఠ మద్ధతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి రైతులకు ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కాటన్‌ అసోసియేషన్‌, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు.

రాష్ట్ర కాటన్‌ వెల్ఫేర్‌ కమిటీతో పాటు జిల్లా కమిటీల్లోకి కాటన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, రైతు ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సీసీఐ ప్రతినిధులకు తుమ్మల సూచించారు. ఈ ఏడాది సాంకేతికంగా తీసుకువస్తున్న పేమెంట్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ యాప్‌లతో మిల్లర్లకు కొనుగోళ్లలో మరింత పారదర్శకతకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీసీఐ, కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు. వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Latest Articles

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్