స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీ ఎయిమ్స్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. పొట్టలో గ్యాస్ సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందికి గురైన మంత్రిని ఆదివారం రాత్రి దిల్లీ ఎయిమ్స్లో అడ్మిట్ చేశారు. కార్డియో న్యూరో సెంటర్లోని కార్డియాక్ కేర్ యూనిట్లో మంత్రికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయనను పరిశీలనలో ఉంచామని.. ఇవాళ డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారని కిషన్రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కిషన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో బీజేపీ వర్గాల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.
ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిన మంత్రి కిషన్రెడ్డి
0
288
Latest Articles
ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు
తెలంగాణలో పవన్ రాజకీయాలపై విమర్శలు వస్తున్న వేళ జనసేనాని చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న ప్రెస్ మీట్ అనంతరం పవన్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో.....
- Advertisement -
- Advertisement -


