Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున అవినీతి

  రాజకీయపార్టీలకు చందాలు ఇవ్వడం సర్వ సాధారణం. ఇది కేవలం మనదేశంలోనే కాదు. ప్రపంచ మంతా ఉన్నదే. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా రాజకీయ పార్టీలకు వివిధ కార్పొరేట్ సంస్థలు విరాళా లు ఇస్తుంటాయి. సహజంగా ఎన్నికల బాండ్లలో ఎటువంటి వివరాలు ఉండవు.రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చే దాతలెవరో ఈ బాండ్లలో ఎక్కడా ఉండదు.

వాస్తవానికి ఎన్నికల బాండ్ అంటే ప్రామిసరీ నోట్‌ లాంటిది.ఎన్నికల బాండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కొన్ని ఎంపిక చేసిన శాఖలలోనే ఎన్నికల బాండ్లు దొరుకుతాయి. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు లేదా సదరు సంస్థల తరఫున రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఎన్నికల బాండ్లను ఉపయోగిస్తారు.ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక లింకు పెట్టింది. ఆర్థిక చట్టం -2017ను కేంద్రం సవరించింది. ఈ సవరణ కారణంగా కార్పొరేట్ కంపెనీలు స్టేట్ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున బాండ్లను కొనుగోలు చేయవచ్చు. తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళాలు అందించవచ్చు. అయితే విరాళాలు ఇచ్చింది ఎవరు…అనే వివరాలేవీ అధికారికంగా బయటకు రావు. దీని వల్ల తమకు బాండ్ల రూపంలో ఆర్థిక సాయం చేసిన కార్పొరేట్ కంపెనీలకు సదరు పార్టీలు అధికారంలోకి వస్తే,సాయం చేసే అవకాశాలున్నాయి. ఒక రకంగా క్విడ్ ప్రోకోకు అవకాశం ఉన్నట్లే . సింపుల్‌గా చెప్పాలంటే ఎన్నికల బాండ్ల వెనుక క్రిడ్ ప్రోకో అనే పెను ప్రమాదం పొంచి ఉంది. దీనిని తప్పు పడుతూ ఏడీఆర్ సహా పలు ప్రజా సంఘాలు, బీజేపీయేతర నాయకులు సుప్రీంకోర్టులో కొంతకాలం కిందట పిటిషన్ వేశారు.

   పిటిషనర్ల తరఫు వాదనల సందర్భంగా ఆసక్తికర అంశం ఒకటి తెర మీదకు వచ్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి రూ.5,127.97 కోట్లు విరాళంగా అందాయి. అయితే మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు కలిపి కేవలం రూ.1783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల బాండ్లు అధికార పార్టీకి మేలు చేస్తున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలు ఓ ఉదాహరణ అని పేర్కొన్నాయి ప్రతిపక్షాలు. అయితే ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు చెప్పింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొ చ్చిన పథకం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది.

     ఇలా ఊరు పేరు లేకుండా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడ మేనని ధర్మాసనం పేర్కొంది.అంతేకాదు… నల్లధనాన్ని అరికట్టడానికే ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పిన మాటను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నల్ల ధనాన్ని అరికడతామన్న సాకుతో సమాచార హక్కును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు వివిధ కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇవ్వడం ఎప్పటి నుంచో ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఎన్నికల బాండ్లకు లేనిపోని ప్రత్యేకత అంటకడుతూ విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఇన్నేళ్లుగా రహస్యంగా ఉంచుతున్నారని సుప్రీంకోర్టు వెల్లడించింది. దాతల పేర్లు రహస్యంగా ఉంచడం అంటే ఆదాయపు అలాగే పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమేనని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చే విరాళాలు పారదర్శకం గా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కార్పొరేట్ సంస్థల నుంచి లెక్కకుమించిన రాజకీయ విరాళాలను అనుమతించడానికి వీలుగా కంపెనీల చట్టంలో చేసిన సవరణలను ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రస్తావించింది. కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

   రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇచ్చే విధానం పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మొత్తంగా ఎన్నికల బాండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందే విరాళాలను తప్పనిసరిగా వెల్లడిం చాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శ కత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి రెండో తేదీన అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్‌తో పాటు మరికొంతమంది నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల బాండ్ల పథకంపై కిందటేడాది అక్టోబరులో సుప్రీంకోర్టు విచారణ జరిపింది.తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

   సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై అనేక ప్రజా సంఘాలు, బీజేపీయేతర పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నికల బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున రాజకీయ అవినీతికి బీజేపీ వేదిక సన్నద్ధం చేసిందని ఈ పార్టీలు మండిపడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికల బాండ్లు ఓ పెద్ద కుంభకోణమని బీజేపీ యేతర పార్టీలు కుండబద్దలు కొట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే ఎన్నికల బాండ్లపై మాట్లాడారు. ఒకవైపు కార్పొరేట్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున బాండ్లు తీసుకుంటోందని ఆరోపించారు. అంతేకాదు మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేస్తోందని మండిపడ్డారు. బ్యాంకు ఖాతాలు ఆపరేట్ కాకపోవడంతో ఎన్నికల వేళ ప్రచారానికి ప్రకటనలు కూడా ఇవ్వలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు నిప్పులు చెరిగారు. కనీసం రైలు ప్రయాణాలకు కూడా కాంగ్రెస్ నాయకుల దగ్గర డబ్బుల్లేవని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

   ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో చాలా సంస్థలపై గతంలో ఐటీ దాడులు జరిగాయి. అలాగే ఈ సంస్థల్లో ఈడీ సోదాలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన కంపెనీలకు ఆ తరువాత కాంట్రా క్టులు లభించడం గమనార్హం. ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, చాలా సందర్బాల్లో ఈడీ సోదాల తేదీలు, విరాళాలు ఇచ్చిన తేదీలు దగ్గరగా ఉండటం కనిపించింది. అయితే ఆయా సంస్థలు ఏఏ రాజకీయ పార్టీలకు చేరాయన్న విషయం ఇప్పటివరకు గోప్యంగానే ఉంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్