హైదరాబాద్ అమోర్ ఆసుపత్రి నిర్లక్ష్యంగా బయట పడింది. రోడ్డు ప్రమాదంలో వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె మృతి చెందింది. ఆక్సిడెంట్ తో రెండు నెలల క్రితం ఆసుపత్రిలో ప్రవల్లిక అనే మహిళ వైద్యం కోసం వచ్చింది. మొదట 3.5 లక్షల ప్యాకేజి తో నయమవు తుంది అన్న వైద్యులు. రెండు నెలల నుండి వైద్యం పేరిట 16 లక్షల వరకు వసూలు చేశారు. అయితే, నిన్న ఉదయం నుండి చికిత్స కు సహకరించడం లేదని బంధువులకు సమాచారం అందిం చారు. రాత్రి చనిపోయిందని తెలిపారు. దాంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.