బీజేపీ, బీఆర్ఎస్ను ఓడిద్దాం.. ఇండియా కూటమిని బలపరుద్దాం. కాంగ్రెస్ను గెలిపించుకుందాం అని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ అన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో టీజేఎస్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో సతీష్ మాట్లాడారు. 2014లో ఎన్నో హామీలిచ్చి మోదీ గద్దెనెక్కారన్నారు. ఇప్పుడు ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచారని ఆరోపించారు. కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే యత్నం మోదీ చేయడం లేదన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డిని గెలిపించాలని సతీష్ విజ్ఞప్తి చేశారు.