స్వతంత్ర వెబ్ డెస్క్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న సాగర్ రింగ్రోడ్డు కూడలిలో చేపట్టిన ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయనతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కూడా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు.
ఫ్లైఓవర్ ప్రమాద బాధితులను పరామర్శించిన కేసీఆర్
0
369
Previous article
Next article
Latest Articles
‘జెన్ జీ’ఓటర్లను ఆకర్షించలేకపోతున్న కాంగ్రెస్
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'జెన్ జీ' ఓటర్ల చుట్టూ తిరుగుతున్నాయి. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యత్వ నమోదుతో దూసుకుపోతుంటే.. అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు....
- Advertisement -
- Advertisement -


