స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర బీజేపీ ఇంఛార్జి సునీల్ దియోధర్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే నాని మాటలతో ఏపీ పరువు పోతుందని మండిపడ్డారు. తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను… క్యాషినో, క్యాబిరే డ్యాన్స్ లుగా మార్చేశారని అన్నారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నానిని జీవితంలో అసెంబ్లీ గడప తొక్క కుండా ప్రజలు చేయాలని కోరారు. త్వరలో గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ ఛార్జిషీట్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు.