29.5 C
Hyderabad
Sunday, February 9, 2025
spot_img

సీఐడీకి కిడ్నీ రాకెట్ కేసు.. మంత్రి దామోదర ఆదేశాలు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలని మంత్రి ఆదేశించారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు ఉండాలని దామోదర రాజనర్సింహ అన్నారు.

దీంతో కిడ్నీ మార్పిడిలపై సీఐడీ విచారణ జరపనుంది. అలకనంద ఆస్పత్రి ఘటనతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. కొన్నేళ్లుగా ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన.. కిడ్నీ ఆపరేషన్లపై సీఐడీ దర్యాప్తు చేపట్టనుంది. ఈ కేసులో మరోవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈవ్యవహారంలో అలకనంద ఆస్పత్రి ఛైర్మన్‌ సుమంత్, మరో వ్యక్తి గోపి సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ గోపీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

Latest Articles

జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్