29.5 C
Hyderabad
Sunday, February 9, 2025
spot_img

తెలంగాణ పారిశ్రామికవేత్తలతో దావోస్‌లో అగ్రిమెంటా?- కిషన్‌రెడ్డి

తెలంగాణ పారిశ్రామికవేత్తలతో దావోస్‌లో అగ్రిమెంటా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పెట్టుబడులు పేపర్‌కు మాత్రమే పరిమితం కావొద్దని.. తెలంగాణ నుంచి పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. అందుకే అనేకమంది పారిశ్రామిక వేత్తలు మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌కి వెళ్లిపోతున్నారని కామెంట్‌ చేశారు.

“వేధింపులు ఆపకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం సరికాదు. కాంగ్రెస్ వేధించని కంపెనీలు లేవు. ముందు ఇల్లు చక్కగా పెట్టుకుని బయటకెళ్ళి ఒప్పందాలు చేసుకోవాలి. రాహుల్ గాంధీ రాజ్యాంగం, రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి. ఆనాడు వల్లభాయ్ పటేల్‌ను పక్కన పెట్టి నెహ్రూ ప్రధాని అయ్యారు. అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పని చేసింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాలను కూల్చింది. పత్రిక స్వేచ్ఛ ను హరించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంపై రాహుల్ గాంధీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు”.. అని కిషన్‌ రెడ్డి అన్నారు.

Latest Articles

జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్