మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కాంతిలాల్ భూరియా ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మధ్యప్రదేశ్లోని రాట్లం నుంచి లోక్సభ ఎంపీగా బరిలో ఉన్న కాంతిలాల్ ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. పేద మహిళలకు ప్రతి యేటా ఈ పథకం కింద రూ. లక్ష ఇస్తామని తెలిపారు. అదే ఇద్దరు భార్యలున్న వ్యక్తికి అయితే ఏడాదికి ఖాతాలో రెండు లక్షలు జమ అవుతాయని అన్నారు. దాంతో భూరియా వ్యాఖ్యలు వివా దాస్పదం అయ్యాయి.