30.7 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

బీఆర్‌ఎస్‌తోనే బీసీలకు న్యాయం – ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో కులగణనకు చట్టబద్దత ఉందోలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నేతలతో కలిసి కవిత డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌ బుసాని వెంకటేశ్వరరావుకు ‘బీసీల సమగ్ర అధ్యయన నివేదిక’ను అందజేశారు. రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందన్నారు.

బీసీలకు రాజకీయ, ఆర్ధిక న్యాయం ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందని, కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో చెప్పిందని.. ఆ పార్టీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చిందని… బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 11 నెలల పాటు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయని రేవంత్ సర్కార్.. నెల రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎలా ఇస్తుందని ఆమె ప్రశ్నించారు.

Latest Articles

వ్యవస్థలు పనిచేయని కారణంగానే..చేయి చేసుకోవడంపై ఈటల క్లారిటీ

హైదరాబాద్‌ చుట్టుపక్కల పేదల భూముల్లో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌. వ్యవస్థలు పనిచేయని కారణంగానే ఎంపీగా తాను వెళ్లి మేడ్చల్‌ జిల్లాలో మాఫియాపై చేయి చేసుకున్నానని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్