ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయం లో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణస్వీకారం పద్దతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయ కుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారని చెప్పారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని లేఖలో పేర్కొన్నారు.