31.3 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

సాధారణ పాస్‌పార్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాస్‌పోర్ట్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తనకు ఐదేళ్ల పాటు పాస్‌ పోర్టు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ వేశారు. వైసీపీ అధికారం కోల్పోయాక జగన్‌కు సీఎంగా ఉండే డిప్లొమేటిక్‌ పాస్‌పోర్ట్‌ రద్దైంది. దీంతో ఆయన సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏడాది పాటు పాస్‌పోర్టు ఇవ్వాలని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. పాస్‌పోర్టును ఏడాదికే పరిమితం చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్‌ తరపు లాయర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌ పాస్‌పోర్టు ఐదేళ్ల పాటు రెన్యువల్‌ చేస్తూ.. సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఏపీ హైకోర్టుకు పిటిషనర్‌ తెలిపారు. విచారణ ఇవాళ్టికి వాయిదా వేయడంతో కోర్టు ఇవాళ మరోసారి విచారణ చేయనుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్