ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఇంటెలిజెన్స్‌ అలర్ట్‌

ఏపీకి ఇంటెలిజెన్స్‌ అలర్ట్‌ ప్రకటించింది. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకారదాడులకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. జిల్లాల ఎస్పీలకు సందేశం పంపింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇదిలా ఉంటే ఏపీలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతా ల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సిట్‌ ఏర్పాటు చేసి ఘటనపై నివేదిక కోరింది. ఇప్పటికే పదుల సంఖ్యలో నిందితులను పోలీసులు అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles

చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్‌

పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్