తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మూడు హెలికాప్టర్లు తిరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యాయి. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో ఇవి సంచరించినట్లు గుర్తించారు. గతంలోనే తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించారు. అలాంటి పవిత్రమైన తిరుమలలో హెలికాప్టర్లు ఎగరడంపై టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాఫ్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తూ ఆలయ పరిసరాల్లో చక్కర్లు కొట్టినట్టు ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.