శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. సామాన్య భక్తుల కోసం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో PAC-1 వద్ద ఫుడ్ కౌంటర్ ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30గంటల వరకు అన్నప్రసాదాల పంపిణీ జరగనుంది. ఇప్పటికే రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్కౌంటర్లు ఉన్నాయి. అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఏసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోన్న సంగతి తెలిసిందే.