Pavan Kalyan | తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జనసేన పార్టీ ఉనికిని చాటాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచించారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. సమస్య తీవ్రత ఆధారంగా ఏ స్థాయిలో స్పందించాలి.. ఏ స్థాయిలో పోరాటం చేయాలి అనేది క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రతి సమస్యను జనసేన పార్టీ తరఫున రాష్ట్రసర్కారు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కో ఆర్డినేటర్లతో పవన్ సమావేశం అయ్యారు. సంబంధిత నియోజక వర్గాల రాజకీయ, సామాజిక పరిస్థితులపై నివేదికను పవన్ కళ్యాణ్ కి వారు అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశాల మీద కో ఆర్డినేటర్లకి పవన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంలో కూడా వీర మహిళలను, జన సైనికులను కలుపుకొని వెళ్లానని సూచించారు.
తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యల మీద దృష్టి సారించాలి: పవన్
0
483
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


