సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్ లో అగ్ని ప్రమాదం… రెస్టారెంట్ లో మంటలు

సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో పోలీస్ భవనంలోని మూడవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో మంటలు వ్యాపించడంతో భవనం మొత్తం పొగతో నిండిపోయింది.

రెస్టారెంట్ పక్కనే ఉన్న హోటల్‌లో ఆ సమయంలో బస చేస్తున్న 67 మంది అతిథులను అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం చేసి సురక్షితంగా బయటకు తరలించారు. ప్రమాద సమయంలో వేగంగా చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మూడవ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్