24.2 C
Hyderabad
Tuesday, January 14, 2025
spot_img

రేవంత్‌ సర్కార్‌పై మాజీమంత్రి కేటీఆర్‌ ఫైర్

పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అని మండిపడ్డారు. ఇది కక్ష్యా, శిక్ష్యా లేక నిర్లక్ష్యమా అని ఎక్స్‌ వేదికగా కాంగ్రెస్‌ సర్కార్‌ను నిలదీశారు.

మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా అన్నారు. ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుంచి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా అంటూ విమర్శించారు. కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం, నేడు అంతులేని నిర్లక్ష్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరని ప్రశ్నించారు.

Latest Articles

జ్యోతి స్వరూపంలో అయ్యప్పను దర్శించుకున్న స్వాములు

మకర సంక్రాంతి పర్వదినాన, మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు ఆర్తిగా ఎదురు చూసి జ్యోతిని దర్శించుకున్నారు. మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తిపారవశ్యం చెందారు. జ్యోతి దర్శనానికి ముందు ఎక్కడ చూసిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్