తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. మాజీ సీఎం కేసిఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి పేర్లను మార్చ కుండానే పంపిణీ చేసింది విద్యాశాఖ. ఇప్పటికే వంద శాతం పుస్తకాల ప్రింటింగ్ పూర్తయి పంపిణీ కొనసాగుతోంది. ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలోనూ SCERT అధికారులు ఇలాంటి తప్పులనే చేశారు. తప్పులు పదే పదే జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.