భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి (34) అకాల మరణం చెందారు. జాండిస్ బారిన పడిన విష్ణువర్ధన్ రెడ్డి… చికిత్స నిమిత్తం నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరినప్పటికీ ఫలితం లేకపోయింది. విష్ణువర్ధన్ రెడ్డికి భార్య, బాబు, పాప ఉన్నారు. విద్యార్థి దశ నుంచి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉంటూ వచ్చారు విష్ణు. ఈయన భార్య డాక్టర్ కావడం గమనార్హం. ఎదిగొచ్చిన కొడుకును కోల్పోయిన ఎమ్.ఎల్.ఎ మహిపాల్ రెడ్డిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. మహీపాల్ రెడ్డికి కలిగిన తీరని పుత్రవియోగం పట్ల స్థానిక నాయకులు జైపాల్ ముదిరాజ్, శ్రీజ మూవీస్ అధినేత – ప్రముఖ దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం తీవ్ర సంతాపం తెలిపారు. ఆయనకు ఈ విషాదం నుంచి తెరుకునే మానసిక శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని వేడుకున్నారు!!
మహిపాల్ రెడ్డి కుమారుడి మృతికి విజయ్ భాస్కర్రెడ్డి సంతాపం
0
285
Latest Articles
విద్యార్థులతో రేవంత్ బ్రేక్ఫాస్ట్
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో రూ.15 కోట్లతో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ పాస్ట్ చేశారు. ఆరుట్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మించింది ప్రభుత్వం....
- Advertisement -
- Advertisement -


