ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు మైనార్టీలను రెచ్చగొడుతున్నారని అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం లోని 17,18వ డివిజన్లలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ప్రజలకు బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో నాటుకుపో యాయని దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. వైసీపీని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీకి వస్తున్న ప్రజాస్పందన చూసి వైసీపీ నాయకులు మైనార్టీల్లో గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారని అంబికా లక్ష్మీ నారాయణ అన్నారు. తాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ముస్లిం లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.


