మాదిగ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ మరోసారి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. తెలంగాణలో ఎస్సీలకు కేటాయించిన 3 రిజర్వ్డ్ స్థానాలను కేవలం మాల సామాజిక వర్గానికే కేటాయించడం దేనికి సంకేతం అని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే సీఎం రేవంత్రెడ్డి మాదిగ సామాజికవర్గం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని మందకృష్ణ తెలిపారు.