పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు ప్రజలు 9 సార్లు అధికారం కట్టబెట్టారని.. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆరుగురిని లాగేసుకుందని విమర్శించారు. ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడిని చేర్చుకుందని కేటీఆర్ అన్నారు.