కాంగ్రెస్ సీఈసీ సమావేశం ముగిసింది. ఏపీలోని 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉండగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది సీఈసీ. కడప పార్లమెంట్ బరిలో షర్మిల, రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు, విశాఖ పార్లమెంట్ బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, అలాగే ఏలూరు లోక్సభ బరిలో లావణ్య, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్, చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేర్లను ప్రకటించింది సీఈసీ. మరోవైపు సీనియర్ నేత రఘువీరారెడ్డి ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నారు.


