పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. సాయంత్రం శాన్ఫ్రాన్సిస్కో చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ ఆపిల్ హెడ్ క్వార్టర్స్ను సందర్శించనున్నారు. పలు కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ బృందం భేటీ కానుంది. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోనున్నారు. అమెరికాలో రెండు నగరాల పర్యటన సంతోషాన్నిచ్చిందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. పలు కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చల గురించి వివరించారాయన. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు.
అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
0
404
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


