CM JAGAN: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్‌..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులను గురువారం తాడేపల్లిలో సీఎం జగన్ విడుదల చేశారు. విదేశీ విద్యా దీవెన నిధులను జమ చేశారు. ఈ మేరకు 357 మంది విద్యార్థులకు రూ.45 కోట్ల 53 లక్షలు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… గత ప్రభుత్వం రూ.318 కోట్లు బకాయిలు ఉంచిందన్నారు. విద్యార్థులు గొప్పగా ఎదగాలని కోరారు. టాప్-50 ర్యాంకులు సాధించిన కాలేజీల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సాయం ప్రకటించారు.
2016-17 నుంచి గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. ఈ స్కీమ్ ను కూడా నీరుగార్చి ఎత్తి వేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ స్కీమ్ లో పూర్తిగా మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇది విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. ఏపీ ఖ్యాతిని గుర్తు పెట్టుకునే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. 350 కాలేజీల్లో ఎవరికీ సీటు వచ్చినా వారికి పారదర్శకంగా సపోర్టు చేస్తూ సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనని స్పష్టం చేశారు. విద్యార్థులు పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, లీడర్లుగా రాణించాలని ఆకాంక్షించారు.
ఈ పథకానికి నాలుగు వాయిదాల్లో స్కాలర్ షిప్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ పొందిన విద్యార్థులకు వెంటనే మొదటి వాయిదా కింద స్కాలర్ షిప్ ఇస్తామని వెల్లడించారు. మొదటి సెమిస్టర్ ఫలితాల అనంతరం రెండో వాయిదాలో స్కాలర్ షిప్, రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల తర్వాత మూడో వాయిదాలో స్కాలర్ షిప్ నిధులను ఇస్తామని చెప్పారు. నాలుగో సెమిస్టర్ ను విజయవంతంగా పూర్తి చేసి మార్క్స్ షీట్ అప్ లోడ్ చేసిన తర్వాత చివరి విడతగా నాలుగో వాయిదాలో స్కాలర్ షిప్ నిధులు ఇస్తామని పేర్కొన్నారు.

Latest Articles

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం

బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్