‘ఆదిపురుష్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్ ముఖ్య అతిథిగా చినజీయర్‌ స్వామి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం గురించే చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో రేపు గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చినజీయర్‌ స్వామి హాజరుకానున్నారని చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్‌, 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే చిత్ర సంగీత దర్శకుడు అతుల్‌ ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పై రానున్నారు. ఓంరౌత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్