స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఇవాళ నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాధలు చెప్పుకోవడానికి దుర్గమ్మను దర్శించుకున్నానని, బాబును రక్షించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు పోరాడుతున్నానని, ఆయనకు ప్రతిఒక్కరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ‘చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నా.. రాష్ట్ర శ్రేయస్సు కోసమే చంద్రబాబు పోరాటం.. చంద్రబాబుకు ప్రజల మద్దతు ఉంది. చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం చేయాలి’ అని భువనేశ్వరి తెలిపారు.
రాష్ట్ర శ్రేయస్సు కోసమే చంద్రబాబు పోరాటం- నారా భువనేశ్వరి
0
428
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


