సీఎం రేవంత్ రెడ్డిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో కుటుంబసభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. గతకొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతు న్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలు ప్రారంభించింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లో సీఎంను కలిసి చర్చలు జరిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోకవర్గాలుండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. కానీ,కాంగ్రెస్లో ఆయనకు సీటు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్లో చేరి టికెల్ దక్కించుకొని గెలుపొందారు. తాజాగా మంత్రి పొంగులేటి చర్చలు జరపడంతో ఆయన కాంగ్రెస్లో చేరేం దుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.