ఇటీవల దేశంలోని చాలా రాజకీయ పార్టీలు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లను నియమించుకుంటున్నారు. వారిలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ టీం చాలా ఫేమస్ అయింది. అనేక రాష్ట్రాల్లో ఐప్యాక్ తో ఒప్పందం చేసుకున్న పార్టీలు అధికారంలోకి కూడా వచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ కూడా ఐప్యాక్ తో గతేడాది ఒప్పందం చేసుకుంది. పార్టీ డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం బలోపేతం చేయడంతో పాటు మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ కోసం ఆ సంస్థ పనిచేసింది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్ బిహార్ లో సొంతగా పార్టీ పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం కోసం ఐప్యాక్ టీం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఐప్యాక్ టీంతో ఒప్పందం రద్దు చేసుకున్న బీఆర్ఎస్
0
316
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


