పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతుండటంతో.. పార్టీ అభ్యర్థులు బరిలో దిగేందుకు వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది. ఓవైపు పక్క చూపులు చూస్తూ.. నేతలంతా జంప్ అవుతుండటంతో గులాబీ శిబిరం ఖాళీ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్యే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్తో.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డటయింది బీఆర్ఎస్ పరిస్థితి. దీంతో లోకసభ అభ్యర్థులు పోటీ చేసేందుకు జంకుతున్నారట. దీనికి తోడు ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించడంతో గెలుపు కష్టసాధ్యమన్న టెన్షన్లో పడ్డట్టు సమాచారం.
ఇప్పటి వరకు 11 మంది లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. ఇందులో చేవెళ్ల నుంచి రంజిత్రెడ్డి ప్రకటించినా.. పోటీ చేయనని తేల్చి చెప్పేసి ఆయన ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్ మాత్రం ప్రచారంలో దూకుడు పెంచారు. మరో 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది బీఆర్ఎస్.